అంగన్వాడీలో బాలమృతం పంపిణీ చేసిన సర్పంచ్

హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామంలో గురువారం అంగన్వాడి సెంటర్ లో సర్పంచ్ వంగ విజయలక్ష్మి పిల్లలకు బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు వయసుకు తగ్గ పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని అంగన్వాడి టీచర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు