అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణకు బొత్స అనుకూలంగా ఉన్నారని చెప్పారు.