అక్టోబర్ 2న టీయూడబ్ల్యూజె చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి గాదె గిరిధర్ రావు

అక్టోబర్ 2న టీయూడబ్ల్యూజె చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి గాదె గిరిధర్ రావు

దేవరకొండ నియోజకవర్గం లో అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) ఆందోళన కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని ఐజేయు దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు గాదె గిరిధర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని,మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని,అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని,అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు, బస్ పాసుల సౌకర్యం వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్లతో గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న,ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు అక్టోబర్ 2న దేవరకొండ డివిజన్, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు,నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు