అక్రమ సంబంధంతో బరితెగించిన ఇల్లాలు

కొడుకును, ప్రేమించిన భర్తను మర్డర్‌ చేసిన యువతి
పోలీసుల అదుపులో యువతి, ప్రియుడు
చెన్నై,మే18(జ‌నంసాక్షి):  పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. ప్రియుడి మోజులో
పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, కన్న కొడుకుని హత్య చేసిన ఓ దౌర్భాగ్యురాలు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉంది. ఈ  ఘటన తమిళనాడు వేలూరు జిల్లా ఆర్కాడు గ్రామ సవిూపంలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లా ఆర్కాడు సవిూప తాజ్‌పురా మందవేలి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా(25) ఎలక్టీష్రియన్‌గా పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం దీపికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయస్సున్న ప్రినీష్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా భర్త, కుమారుడు ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించలేదని గురువారం ఆర్కాడు పోలీసు స్టేషన్‌లో దీపిక ఫిర్యాదు చేసింది. అతని ఫోన్‌ నెంబరు ఇస్తే ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దీంతో తన భర్త ఇంట్లోనే ఫోన్‌ పెట్టేసి వెళ్లినట్లు సమాధానం ఇచ్చింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు దీపిక పొంతనలేని సమాధానాలు  చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని  తమదైన శైలిలో విచారించగా భర్తతోపాటు కుమారుడిని తానే హత్య చేసి ఇంటి సవిూపంలోని చెరువులో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకుంది. నిందితురాలు సమాచారం మేరకు భర్త, కుమారుడిని పూడ్చిపెట్టిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. తహసీల్దారు వసంత లత, రాణిపేట డిఎస్పి కలైసెల్వన్‌, ఆర్కాడు తాలూకా ఇన్‌స్పెక్టరు భాను తదితరులు మృతదేహాలను వెలికి తీయించి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దీపికకు భర్త రాజా స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ కారణంతోనే భర్తతోపాటు కుమారుడిని దారుణంగా హత్య చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. వీరిని అడ్డుతొలగించుకుని అతడితో కాపురంచేయాలనుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతురాలిని అరెస్ట్‌ చేశారు. అలాగే దీపికతో సంబంధం పెట్టుకున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో అంతా ఆశ్చర్య పోయారు.