అజిత్‌సింగ్‌తో ఐకాస నేతల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును మద్దతివ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు అజిత్‌సింగ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.