అద్వానీతో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : భాజపా ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ఢిల్లీ వచ్చారు. ఆ పార్టీ అగ్రనేత ఎల్‌, కె అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌తో మోడీ భేటీ కానున్నారు.