అద్వానీతో భేటీ అయిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. పార్టీ ఎన్నికల సారథిగా నియమితులైన తర్వాత మోడీ తొలిసారిగా అద్వానీతో సమావేశం అయ్యారు. జేడీయూ అంశంతో పాటు. పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరుగనున్నట్లు సమాచారం. అద్వానీ నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషిని కూడా మోడీ కలిశారు.