అద్వానీతో రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రోజు ఆ పార్టీ అగ్రనేత ఆద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. గోవాలో జరిగిన పార్టీ సమావేశాలకు అనారోగ్య కారణాలవల్ల అద్వానీ హాజరవలేదు. అద్వానీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ సమావేశాల్లో మోడీని పార్టీ ప్రచార సారధిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.