అద్వానీతో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన భాజపా అగ్రనేత ఎలకే అద్వానీని ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ ఈ రోజు మరోసారి కలిశారు. నిన్న కూడా ఆమె ఇతర నేతలతో పాటు అద్వానీని కలిసి రాజీనామా ఉపసంహరించుకోమని ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే.