అద్వానీని కలిసిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మోడీ హస్తినలో అడుగుపెట్టారు. గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ఇవాళ బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని కలిశారు. ఇవాళ అద్వానీ నివాసానికి వెళ్లిన నరేంద్రమోడీ అద్వానీతో బీజేపీలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మోడీ అద్వానీ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్లారని సమాచారం. అంతకు ముందు మోడీ మరో సీనియర్‌ నేత మురళి మనోహర్‌ జోషిని కలిశారు.