అద్వానీని కలిసిన భాజపా నేతలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, సీనియర్ నేతలు జశ్వంత్సింగ్, ఉమాభారతి అద్వానీని కలిశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు.