అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకుంటారు : రాజ్నాథ్
ఢిల్లీ : అద్వానీ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని, బాధ్యతల్లో కొనసాగుతారని భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని ఆయన తెలిపారు. అద్వానీతో సుదీర్ఘ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజ్రాథ్ సింగ్ అద్వానీని తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్లు కూడా అద్వానీకి నచ్చజెప్పారని రాజ్నాథ్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో అద్వానీ మెత్తబడినట్లు భావిస్తున్నారు.