అద్వానీ రాజీనీమా బాధాకరం: సుష్మాస్వరాజ్
ఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా బాధాకరమని ఆ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్షనేత అయిన సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాజీనామా ఉపసంహరణకు అద్వానీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని సుష్మాస్వరాజ్ చెప్పారు. వెంకయ్యనాయుడు, అనంతకుమార్, మల్హోత్రాలతో పాటు సుష్మా కూడా అద్వానీకి నచ్చజెప్పేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.