అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు కూడా పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు హోమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలతో సీఎం సమావేశమవుతున్నారు. నిన్న రాష్ట్రపతి, కాంగ్రెస్‌ అధక్షరాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఆజాద్‌ దిగ్విజయ్‌సింగ్‌లతో భేటీ అయి తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి చర్చించారు