అన్నా క్యాంటీన్ ప్రారంభం
కాకినాడ,ఫిబ్రవరి7(జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా తుని మునిసిపాల్టీ పరిధిలోని స్ధానిక రాజా బహుదూర్ మునిసిపల్ పార్కు ఆవరణలో అన్నా క్యాంటీన్ ను గురువారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ యనమల కృష్ణుడు ఈ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో ఈ అన్నా క్యాంటీన్ను నిర్మించినట్లు యనమల కఅష్ణుడు పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారంతా అల్పాహారం సేవించి అన్నా క్యాంటీన్ రుచిని ఆస్వాదించారు.