అన్నివర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ కృషి

నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశారు: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టీడీపీలు నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణను అనాథను చేశారని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగేళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అన్నదాతల కష్టసుఖాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసునని, అందుకే వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బంది లేకుండా రెండు సీజన్‌లకు కలిపి ఎకరాకు రూ.8వేలు అందించడమే కాకుండా, వారి జీవితాల భద్రతకు బీమా పథకాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు.ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. పండుగలనుసంతోషంతో జరుపుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకు కానుకలను అందజేస్తున్నారన్నారు. ముస్లింలు,క్రిస్మస్‌కు కూడా కైస్త్రవులకు ఇదే రీతిలో కానుకలను అందజేశారన్నారు. గత పాలకులు చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ తనకంటూ ఒక ప్రత్యేకతను నిరూపించు కున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం అన్నివర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. అన్నివర్గాల ప్రజల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.