అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.

తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు .శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఘాన్ గాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయస్వామి సన్నిధికి చేరుకుని నదిలో స్నానం ఆచరించి ,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు నందకుమార్ పూజారి వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. పౌర్ణమి పురష్కరించు కొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా యాలాల మండలం కమల్ పూర్ గ్రామానికి చెందిన
మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్ హాజరై ప్రారంభించా రు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమి పురష్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాండూర్ పట్టణం ఆదర్శనగర్ కట్ట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు పాపయ్య, మున్సిపల్ రిటర్న్ ఉద్యోగి రాములు,కమల్ పూర్ గ్రామవాసులు రాజు, బిచ్చప్ప, అమరప్ప, రాములు, ఆలయ పూజారులు భక్తులు తదితరులు ఉన్నారు.