అఫ్జల్గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా
న్యూఢిల్లీ : పార్లమెంట్పై దాడి కేసులో అఫ్జల్గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఉగ్రవాదులకు ఇదో హెచ్చరిక అని పేర్కొన్నారు.