అభివృద్దిని చూడలేకనే కాంగ్రెస్‌ విమర్శలు

జనగామ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గుచేటని  జనగామ  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  అన్నారు.కేసీఆర్‌ ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటానికి మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేపట్టారన్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే సీఎం నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతీ ఊరు పచ్చగా పంట పొలాలతో కళకళ లాడాలనేదే కేసీఆర్‌ సంకల్పమన్నారు.  రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడి సఫలీకృతమైన కేసీఆర్‌ ఆశించిన ఫలితాలు వస్తుండడంతో జిల్లాల పునర్విభజన చేపట్టి చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారని అన్నారు. చిన్న జిల్లాలతో తెలంగాణ సత్వర అభివృద్ధి జరిగి, బంగారుతెలంగాణ కాగలదని తెలిపారు. ఇకపోతే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే అదనపు  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారనిఅన్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోకుండా రైతులు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలన్నారు.