అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం

సూర్యాపేట,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సూర్యాపేట జిల్లా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బోడి కొండలపై 190 హెక్టార్లలో నాటిన 40 వేల మొక్కల పెరుగుదల, నిర్వహణను పరిశీలించారు. అదేవిధంగా కందగట్ల గ్రామంలోని చెరువుకట్టపై ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 400 ఈత మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కందగట్ల గ్రామంలో రూ. 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, రూ. 10 లక్షలతో మత్స్యకారుల సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కందగట్ల గ్రామంలోని 314 మందికి రైతుబంధు సామూహిక జీవిత బీమా బాండ్లను పంపిణీ చేశారు.