అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
 కోదాడ టౌన్ డిసెంబర్ 09 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం పరిధిలో ఎంతో కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న మురికి నీటి సమస్యకు శాశ్వత పరిష్కరంగా పట్టణంలో నిర్మితమవుతున్న స్టోర్మ్ వాటర్  డ్రైనేజ్ సిస్టమ్ పనులని కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ శుక్రవారం నాడు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణంలో నిర్మిత మవుతున్న స్టోర్మ్ వాటర్  డ్రైనేజ్ సిస్టమ్ వలన పట్టణము లోని మురికి నీటి సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది అని తెలిపారు.ఈ క్రమంలో నిర్మిత మవుతున్న డ్రైనేజ్ సిస్టమ్ పనులను త్వరతి గతిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చెయ్యాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు మునిసిపల్  డి ఈ పిచ్చయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు