అమరవీరుల ఆశయాలు సాధించాలి

టీఎన్జీవో మెదక్ జిల్లా జనం సాక్షి ప్రతినిధి మెదక్అధ్యక్షుడు దొంత నరేందర్
తెలంగాణ భవన్లో ఘనంగా విమోచన దినోత్సవం

మెదక్ : భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను సాధించాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలకు ఆగస్టు 15 1947 నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు వెలివేరిసాయన్నారు. వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు తమ విరోచిత పోరాటాల ద్వారా రజాకార్లను తరిమికొట్టిన దొడ్డి కొమరయ్య, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న లాంటి మహనీయులందరిని స్మరించుకోవాలన్నారు. నిరంకుశత్వానికి, రజాకార్లకు, జాగిరుదార్లకు వ్యతిరేఖంగా ఎంతో మంది ఎదురొడ్డి పోరాడారని గుర్తుచేశారు. మహనీయుల స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న సంఘవిద్రోహ కార్యకలాపాలను సంఘటితంగా అడ్డుకొని చైతన్యవంతులుగా ఉండి మెదక్ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్ శ్రీనివాసరావు, మెదక్ డిప్యూటీ ఈ ఈ శివ నాగరాజు, గణాంకాధికారి తోట కుమార్ నీల, టీఎన్జీవో జిల్లా కోశాధికారి బట్టి రమేష్, ఉపాధ్యక్షులు ఎండి ఇక్బాల్ పాష, సంయుక్త కార్యదర్శి రాధా, కార్యవర్గ సభ్యురాలు లీల, ఏడుపాయల వనదుర్గ యూనిట్ అధ్యక్షులు సూర్య శ్రీనివాస్, సహాయ కార్య నిర్వాహక ఇంజనీర్ శ్రీహరి గౌడ్, గోపాల్, గాంధీ బాబు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

తాజావార్తలు