అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు ఘనంగా అర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సైనిక ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.