అమెరికాలోరోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి


హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  మేడ్చల్‌ మల్కాజ్‌ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఎంబసీ అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు. మౌలాలీలోని కెపిహెచ్‌బి కాలనీలో కొత్తూరు సత్యనారాయణ నివసిస్తున్నారు. సత్యనారాయణ తన కుమారుడు రంజిత్‌ను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపాడు. రంజిత తన స్నేహితుడు విజయ్‌తో కలిసి అట్లాంటాలో ఉంటున్నారు. అగస్టు 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో రంజిత్‌ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని అట్లాంటాలో ఉన్న భారత ఎంబసీ అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రంజిత్‌ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్తూరు సత్యనారాయణ కన్నీంటితో వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర
యంత్రాంగాలు స్పందించి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.