అరుణాచల గిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 26(జనంసాక్షి):పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరికి నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు నాగర్ కర్నూల్ ఆర్టిసి డిపోమేనేజర్ టి.దేవరాజు బుధవారం నాడు ఒక ప్రకట నలో తెలిపారు.ఈ బస్సు జూలై 30వ తేది రాత్రి 10గంటలకు నాగర్ కర్నూల్ నుండి బయల్దేరి వయా వనపర్తి ద్వారా మరుసటి రోజు ఉదయం 6గంటలకు కాణిపాక విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం మళ్లీ 1గంటలకు బయల్దేరి వేలూరులోని గోల్డెన్ టెంపు ల్ దర్శనం అనంతరం రాత్రికి ఏడు గంటలకు బయల్దేరి అరుణాచలం రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుంటుంది.ఒకటో తేదీ అరుణాచలంలో గిరి ప్రదర్శన దర్శనం అనంతరం సాయంత్రం 6గంటలకు అరుణాచలంలో బయలుదేరి వనపర్తి మీదుగా నాగర్ కర్నూల్ తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు.బస్సు టికెట్ ధర ఒక్కొక్కరు రూ.3200 ఉంటుందని తెలిపారు.ఈ బస్సు టికెట్ ను ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ఇతరవివరాలకు,9959226288,7382827591,7382827527 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.