అర్ధరాత్రి భయం గుప్పిట్లో నాగారంవాడ కాలనీవాసులు

అర్ధరాత్రి భయం గుప్పిట్లో నాగారంవాడ కాలనీవాసులు

రాయికల్,అక్టోబర్ 4 (జనంసాక్షి)
పట్టణంలోని నాగారం వాడకు చెందిన కోల జల పట్టపగలే దారుణ హత్యకు గురై నేటికీ నెల రోజులు కావస్తున్న మర్డర్ మిస్టరీ విడకపోవడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలోనే నిన్ను అర్ధరాత్రి ఒక కాలనీవాసుని ఇంటికి గుర్తు తెలియని దుండగుడు గోడ దూకిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లోవారు అప్పటికీ పడుకోకపోవడంతో వారిని చూసి వెనుదిరిగి పారిపోయిన సంఘటన మరియు కొన్ని రోజులక్రితం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలో సంచరించుతున్నట్లు చూసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా గడిచిన వారంరోజుల వ్యవధిలోనే ఇలాంటి అనుమానిత, భయాందోళన సంఘటనలు పదే పదే రావడంతో భయం గుప్పిట్లో నాగారంవాడ కాలనీవాసులు ఉంటున్నారు. ఇలా కాలనీలో జల మర్డర్ అయినా నేటి వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడం మరియు ఇలాంటి అనుమాన సంఘటనలు తరుచూ రావడంతో కాలనీవాసులు భయం గుప్పిట్లో ఉండాల్సి వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలు అయినా అమర్చితే బాగుంటుందని స్థానిక నాగారం వాడ కాలనీవాసులు కోరుకుంటున్నారు