అల్ఫోర్స్ ఐఐటీలో గణిత ఒలంపి యాడ్ పరీక్ష

అల్వాల్ సర్కిల్ లోని అల్ఫోర్స్ ఐఐటీలో నీట్ అకాడమీలో ఆదివారం భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా అల్ఫోర్స్ మాథ్స్ ఒలంపియాడ్ పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యా సంస్థ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. ఈ పరీక్షలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకొనుటకు సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తమ సంస్థ ప్రతి సంవత్సరం ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుందని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో తమ సంస్థ ముందుంటుందని ఆయన నరేందర్ రెడ్డి వెల్లడించారు.