అసెంబ్లీ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

 

బీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా కేసీఆర్ తొలిసారి శాస‌న‌స‌భ‌కు హాజ‌రు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.
కాసేపట్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.