ఆచూకీ లభించని వారు 3వేల మంది

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో భాగంగా ఇంకా 3 వేల మంది ఆచూకీ లభించలేదని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణ తెలిపారు. 30 రోజుల్లో వారి ఆచూకీ తెలియకుంటే చనిపోయినట్లు ప్రకటిస్తామని పేర్కొన్నారు. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు ఉచితంగా నెలకు సరిపడే రేషన్‌ సరఫరా చేస్తామని చెప్పారు.