ఆజాద్‌తో కాంగ్రెస్‌ బృందం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయింది. ఈ బృందంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గాదె వెంకటరెడ్డి, చెంగల్‌రాయుడు, మల్లు రవి, చిన్నారెడ్డి, సురేశ్‌రెడ్డి ఉన్నారు.