ఆటోను ఢీకొన్నకారు: 13మందికి గాయాలు

కాకినాడ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ఘటన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శృంగ వృక్షంపేట గ్రామానికి చెందిన 13 మంది కూలీలు పని నిమిత్తం పెరుమల్లపురం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా.. ఒంటిమామిడి వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.