ఆటోను ఢీకొన్న లారీ: పదిమందికి గాయాలు

ఒంగోలు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):   జంక్షన్‌ రహదారికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ బ్యానర్‌ వల్ల రోడ్డు ప్రమాదం సంభవించిన ఘటన గురువారం ఉదయం  ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలో చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సవిూపంలో రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీ బ్యానర్‌ ఉండటంతో అటు వైపు నుండి వస్తున్న ఆటో కనబడక లారీ, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న వారంతా అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన కూలీలే. ఈ రోజు ఉదయం శనగ కోతలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి జంక్షన్‌ రహదారులు కనబడకుండా రోడ్డుకు అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ బ్యానరే కారణమని ఆవేదన చెందాడు.