ఆదర్శనీయుడు అంబేద్కర్ ఎమ్మెల్యే

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.అల్వాల్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ ఆల్వాల్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ శిల్పి ప్రజాస్వామ్య పరిరక్షకుడు సంఘసంస్కర్త మహా మేధావి న్యాయ శాస్త్రవేత్త అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి రాజ్ జితేందర్ నాథ్ సబిత అనిల్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ బొబ్బిలి సురేందర్ రెడ్డి భాస్కరరావు బి నాగేశ్వరరావు, రాపర్తి చంద్రశేఖర్, శ్రవణ్ కుమార్, రాజు, శ్రీరాములు, శేఖర్, పరమేష్, సురేష్, రామకృష్ణ, బాలరాజ్, చందర్, జ్యోతి, కవిత, సులోచన, తదితరులు పాల్గొన్నారు.