ఆర్టీసీ కార్మికుల ఒకరోజు దీక్ష
ఏలూరు,జనవరి28(జనంసాక్షి): ఎపిఎస్ఆర్టిసి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డిపో వద్ద సోమవారం ఒక్క రోజు ‘ సామూహిక నిరాహార దీక్ష ‘ చేపట్టారు. ఈ దీక్షలను సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ నెక్కంటీ సుబ్బరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 6 వ తేదీ నుండి నిర్వహించనున్న ఆర్టిసి సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకే ఈ దీక్ష చేపట్టామని అన్నారు.