ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ

విజయవాడ బస్టాండ్‌ : తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రూ. 2.45లక్షల నగదు ఉన్న బ్యాగును పొగొట్టుకున్నాడు. బస్సులోని బ్యాగును గమనించిన డ్రైవర్లు టి. అశోక్‌బాబు, జీఎస్‌రావులు బ్యాగును విజయవాడ డిపో అధికారులకు అప్పగించారు. అందులో లభించిన చిరునామా ప్రకారం బ్యాగ్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సాంబశివరావుది గుర్తించారు. బాధితులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బ్యాగులో ఉన్న వస్తువుల వివరాలను చెప్పడంతో పోలీసుల సమీక్షంలో బ్యాగును అప్పగించారు. ఈ సందర్భంగా డ్రైవర్లను ఆర్టీసీ సిబ్బంది, అధికారులు ప్రయాణికులు అభినందించారు.