ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది చిదంబరం

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని గతేడాది ఈ సమయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉందన్నారు. త్వరలోనే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు చిదంబరం గురువారం ప్రకటించారు. గత అగస్టు నెల నుంచి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బంగారం దిగుమతులు బాగా తగ్గాయని, ఇంకా తగ్గితే తాను మరింత సంతోషిస్తానని చిదంబరం అన్నారు. బంగారం మీద పెట్టుబడి పెట్టడం సురక్షితమన్న భావన తప్పని చిదంబరం మరోసారి స్పష్టం చేశారు.