ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ నేడు

ఢిల్లీ : భాజపా అగ్ర నేత ఎల్‌కే అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సంమ్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అనారోగ్యం కారణంగా అద్వానీ నిన్నటి సమావేశాలను వాయిదా వేసుకున్నారు. గోవా సమావేశాల్లో మోడీని పార్టీ ప్రచార సారధిగా నియమించడం, అనంతరం అద్వానీ రాజీనామా చేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత నచ్చజెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఆ తర్వాత మంగళవారంనాడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అద్వానీతో 40నిమిషాలసేపు భేటీ అయ్యారు. అగ్రనేత అశీస్సులు తీసుకున్నానని మోడీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ అద్వానీ మళ్లీ మోహన్‌ భగవత్‌తో భేటీ అవుతున్నారు.