ఆర్ఎస్ఎస్ చీఫ్తో అద్వానీ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో బీజేపీ అగ్రనేత అద్వానీ భేటీ అయ్యారు. ఇవాళ ఆయన సంఘ్భవన్లో భగవత్తో సమావేశమయ్యారు. నిజానికి నిన్ననే భగవత్తో అద్వానీ భేటీ కావాల్సి ఉన్న అద్వానీకి అనారోగ్యంగా ఉండటంతో ఇవాల్టికి వాయిదా పడింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ అద్వానీని కలిసి ఆశీస్సులు తీసుకోవడం, రాజీనామా అద్వానీ ఉపసంహరించు కోవడం తదితర అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది.