ఆస్పత్రిలోనే రాఖీ కట్టి కన్నుమూసిన యువతి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  పండుగుపూట మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ కట్టి కన్నుమూసింది వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్‌ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల వ్యవధిలో తుదిశ్వాస విడిచింది. కండ్ల ముందే తమ కూతరు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.