ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

 బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన సంఘటన పైన ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పాముకాటుకు గురైన కదం కిషోర్ రావు- లక్ష్మి దంపతుల పెద్ద కొడుకు నితిన్ కుమార్ వయసు సుమారు 17 నివాసం బషీరాబాద్, బాలుడిని చికిత్స చేయకుండా స్నేక్ బైట్ వీనం అందుబాటులో లేదని చెప్పేసి తాండూర్ వెళ్ళండి అని చెప్పడం సరి కాదని, ఆ బాలుడు వికారాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణం పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి ఎందుకని,పట్టించుకోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది జగదీష్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూడూరు ప్రియాంక శ్రవణ్ కుమార్, గ్రామ యువకులు
అనూప్ ప్రసాద్,రియాజ్, నరసింహులు,నరేష్,ఇషాక్ ధనరాజ్,సంతోష్,చిన్న లక్ష్మీకాంత్,తదితరులు పాల్గొన్నారు