ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్ నిర్ణయం వాయిదా
ఢల్లీి : ఆహార భద్రత బిల్లు అమలుకు ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం వాయిదా వేసింది. ఆహార భద్రత బిల్లు సిద్ధంగా ఉందని, పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఆహార భద్రత బిల్లు ఆమోదానికి సంబంధించి కమల్నాథ్, కె.వి. థామస్ విపక్షాలను సంప్రదిస్తారని చిదంబరం తెలిపారు.