ఇంటర్నెట్ ఛార్జీలు తగ్గించిన వొడాఫోన్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇంటర్నెట్ ఛార్జీలను వొడాఫోన్ 80 శాతం వరకు తగ్గించింది. 10 కేబీపై ఇప్పటివరకు చేస్తున్న 10 పైసల చార్జీని 2 పైసలకు తగ్గించింది. 2 జీ సేవలకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతానికి కర్ణాటక, పశ్చిమ యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. దీన్ని త్వరలో దశలవారీగా దేశమంతా అమలు చేస్తామని వొడాఫోన్ తెలిపింది.