ఇండోనేషియాలో బంగారం గని కూలి 12మంది మృతి

ag5dpc44 హైదరాబాద్‌: ఇండోనేషియా లోని బొగోర్‌ జిల్లాలో బంగారం గని కూలి 12మంది మృతి చెందినట్లు బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. గని కూలిన సమయంలో దాదాపు 10-30 మీటర్ల లోతులో కూరుకుపోవడంతో కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ గనిని నెల రోజుల క్రితమే మూసేశారని, అక్రమంగా తెరిచి లోపలికి ప్రవేశించారని పేర్కొన్నారు.