ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. ఇందిరమ్మ పేరు చెడగొట్టొద్దని ఆయన కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి పదవి పోతోందనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీని 2014 ఎన్నికలలో మంత్రిని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.