ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసం
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరభ్యాసం, అక్షరదీవెన వైభవంగా జరిగింది. అలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులకు పలక, బలపం, బ్యాగ్లు అందజేశారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య చిన్నారులకు అక్షరాలను దిద్దించారు. ప్రతి ఏటా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అక్షరదీవెనకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ తెలిపారు.