ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

రాయ్‌పూర్‌, జనంసాక్షి: ఛత్లీస్‌గఢ్‌ నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడిన రాయపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పరార్శించారు. బస్తర్‌ జిల్లాలోని దర్భాషూట్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు మెరుపు దాడిచేసి పలువురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారిని పరామర్శించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అన్నారు. హింసకు వ్యతిరేకంగా యావత్‌ జాతి ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు.