ఇది మూడో సారి

uwffux6bపాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ లో గత అర్ధ్రరాత్రి నుంచి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. 82 ఎంఎం ఫిరంగులతో దాడులకు దిగింది. రాత్రి 11 గంటల నుంచి కాల్పుల మోతలతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. భారత బలగాలు కూడా పాక్ సైన్యానికి ధీటుగా సమాదానం చెబుతున్నాయి. దాంతో కాల్పులతో పూంచ్ సెక్టార్ దద్దరిల్లుతోంది. గత 24 గంటల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటం ఇది మూడో సారి.