ఈనెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సు

ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సుకు ముఖ్య అతిధిగా బృందా కారత్‌ హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా గిరిజనుల మనుగడకు ప్రమాదం తెచ్చే బాక్సైట్‌ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. పౌరగ్రంథాలయంలో నిర్వహించే ఈ సదస్సుకు గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, విద్యార్థులు అందరూ హాజరుకావాలని కోరారు.