రైలు ప్రమాదంలో విద్యార్థి మృతి : కాన్పూర్‌లో ఉద్రిక్తత

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో రైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సహ విద్యార్థులు ఆగ్రహంతో నగరంలో ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. పలు బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.