ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షత వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలణొఫ్టినెంట్‌ గవర్నర్లు ) నుంచి కలిపి మొత్తం 30 మంది గవర్నర్లు పాల్గొంటున్నారు. సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి షిండే తదితరులు పాల్గొన్నారు.